Menu
kotlata.com
  • Sample Page
kotlata.com

హుజూర్ నగర్ స్పెషల్ : భూమి పట్టా ఇవ్వలేదని 85 ఏళ్ల వృద్ధురాలు పోటీ

Posted on September 30, 2019September 30, 2019 by Shankar

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి ప్రధాన అభ్యర్థులుగా(కాంగ్రెస్-నల్లమడ పద్మావతి ఉత్తమ్ రెడ్డి, టీఆర్ఎస్-సైదిరెడ్డి, టీడీపీ-చావా కిరణ్మయి, బీజేపీ-రామారావు) నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో 60 మంది కూడా నామినేషన్లు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే 85 ఏళ్ల ఓ వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీస్కొచ్చేందుకు నామినేషన్ వేయడం హైలైట్. లక్ష్మీనర్సమ్మ అనే వృద్ధురాలు తనకున్న వందెకరాల భూమికి పట్టా ఇవ్వట్లేదని అధికారులు చుట్టూ తిరిగినా పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదని ఓ ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా తన భూమికి పట్టా ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వంపై నిరసనగా ఉప ఎన్నిక బరిలో నిలిచింది. నడవడానికి చేతగాకపోయినా ఊతకర్రతో వచ్చి మరీ నామినేషన్ వేయడం విశేషం. లక్ష్మీనర్సమ్మతో పాటు మట్టంపల్లి మండలం గుర్రంపోడు గిరిజనులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.

Recent Posts

  • మాస్కు కట్టాల్సింది మూతికి, బైకు నెంబర్ ప్లేటుకు కాదు…
  • ‘బిత్తిరి సత్తి’ టీవీ9 నుంచి వెళ్లడానికి అసలు కారణం..! సత్తి పయనమెటు..?
  • లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఏమనుకుంటుందంటే…..
  • బిగ్ బ్రేకింగ్ : 7 లక్షల మందికి కరోనా టెస్టులు
  • మా వాళ్లను ఆదుకోండి… చంద్రబాబు లేఖలు
  • మాస్క్ లేకుంటే.. వెయ్యి రూపాయలు ఫైన్…
  • లిప్ లాక్, ఎక్స్ పోజింగ్ చేయమంటున్నారు…. అందుకే…..
  • కొండగట్టుపై కరోనా ఎఫెక్ట్.. కానరాని భక్తులు
  • కొరటాలను కూడా సెట్ చేస్తున్న బన్నీ…?
  • అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు…
  • లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం…..
  • బన్ని బర్త్‌డే కు ఎవరెవరు ఏమన్నారు…
  • ట్రంప్ బెదిరింపులకు మోడీ తలొగ్గాడా ?
  • సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్…. కేసు నమోదు
  • ఎమ్మెల్యే కోనేరు కోనప్పను క్వారంటైన్‌లో ఉంచండి….

Categories

  • ANALYSIS
  • Devotional
  • ENTERTAINMENT
  • HOME
  • NEWS NOW
  • POLITICAL NEWS
  • SPORTS
  • Uncategorized
©2021 kotlata.com | Powered by WordPress & Superb Themes