
అవంతిక మిశ్రా సినీ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు తమిళ చిత్రాల్లో నటించింది. 
Avanthika Mishra : అవంతిక మిశ్రా 1992, మే 30న ఢిల్లీలో జన్మించారు. ఆమె బెంగళూరులోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో చదువుకున్నారు. 
ఆమె తండ్రి ఎం.కె. మిశ్రా ఎయిర్ ఫోర్స్ అధికారి, రిటైర్ అయ్యాక లాయర్గా పనిచేస్తున్నారు. అవంతిక మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. 
ఆ తర్వాత 2014లో విడుదలైన ‘మాయ’ అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమయ్యారు. 
మీకు మీరే మాకు మేమే (2016), వైశాఖం (2017), మీకు మాత్రమే చెప్తా (2019), భీష్మ (2020, “సింగిల్స్ ఆంథెమ్” పాటలో అతిథి పాత్ర)లలో నటించారు. 
‘అతిథి’ అనే తెలుగు వెబ్ సిరీస్లో కూడా నటించారు. ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో కూడా నటించారు,
ముఖ్యంగా ‘ఎన్న సొల్ల పోగిరై’, ‘డి బ్లాక్’ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

