Bihar : బీహార్లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఖగారియాలో చోటుచేసుకుంది. బాధితురాలు కుటుంబం దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, బాలికకు తెలిసిన ఒక వ్యక్తి మాట్లాడుకుందామని చెప్పి ఆమెను ఇంటి నుంచి బయటకు పిలిచి, తన బైక్ పై స్థానికంగా ఉన్న ఒక కట్ట వద్దకు తీసుకెళ్లాడు.
అక్కడికి చేరుకున్న తర్వాత, అతను మరో ఐదుగురు వ్యక్తులు ఆ అమ్మాయికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్పృహ తిరిగి వచ్చే వరకు ఆ అమ్మాయి రాత్రంతా అక్కడే ఉండిపోయింది. తెల్లవారుజామున ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులకు ఏమి జరిగిందో చెప్పింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అనుమానితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు సూపరింటెండెంట్ రాకేష్ కుమార్ తెలిపారు. అయితే ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.