PM Modi : 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ అనేక ప్రకటనలు కూడా చేశారు. జీఎస్టీ సమీక్షతో పాటు, ప్రధాని మోదీ ప్రధానమంత్రి వికాసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ పథకం కింద, యువతకు మొదటి ఉద్యోగం పొందిన వారికి రూ. 15 వేల ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది దేశ యువతకు గొప్ప వరమని అన్నారు. నా దేశ యువత కోసం రూ. లక్ష కోట్ల విలువైన పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రధాన మంత్రి వికాసిత్ భారత్ రోజ్గార్ యోజన నేటి నుంచి అమలులోకి వచ్చిందని ఆయన అన్నారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం రూ.15,000 ఇస్తుందని, దీనివల్ల 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. ఇందుకోసం యువత కోసం రూ. లక్ష కోట్లు నిధులును కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లుగా మోదీ తెలిపారు.
1 lakkha crores PM Vikasit Bharat Rojgar Yojana to start from today!
— Alok Bhatt (@alok_bhatt) August 15, 2025