Divorce: బస్తీకి చెందిన ఒక 25 ఏళ్ల యువకుడు తన విడాకుల మంజూరీని ఒక వినూత్న రీతిలో జరుపుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా విడాకుల తర్వాత పార్టీలు చేసుకోవడం చూస్తుంటాం, కానీ ఇతను మాత్రం దేవుడికి మొక్కు తీర్చుకుంటూ ఏకంగా 9 కిలోమీటర్ల ‘దండవత్ యాత్ర’ (సాష్టాంగ నమస్కారం చేస్తూ సాగే యాత్ర) చేపట్టాడు.
At a time when divorce parties are emerging as a new hot invite, a 25-year-old man from Basti celebrated the personal milestone with a unique thanksgiving for the local deity.
Making the most of the auspicious occasion of Navratri, the newly-divorced man undertook a 9-km… pic.twitter.com/SZlQqvRMyn
— Hate Detector 🔍 (@HateDetectors) March 30, 2026
నార్ఖోరియా గ్రామానికి చెందిన జోగేష్ అనే యువకుడికి 2022లో వివాహం జరిగింది. అయితే పెళ్లయినప్పటి నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ వేధింపులు భరించలేక విడాకులు కావాలని అతను ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఆ కష్టకాలంలో.. “తనకు విడాకులు మంజూరై ఈ బంధం నుంచి విముక్తి లభిస్తే, స్థానిక బైదా సమయ్ మాత ఆలయానికి దండవత్ యాత్ర చేస్తానని” మొక్కుకున్నాడు.
2026 జనవరిలో జోగేష్కు చట్టబద్ధంగా విడాకులు మంజూరయ్యాయి. దీంతో నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, తన మొక్కు తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ యాత్రలో.. నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఆ మార్క్ దగ్గరకు జరిగి మళ్లీ నమస్కరిస్తూ 9 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 12 గంటల పాటు శ్రమించి పూర్తి చేశాడు. రోజంతా ఉపవాసం ఉండి, “జై శ్రీరామ్”, “జై బజరంగబలి” నినాదాలతో ఆలయానికి చేరుకున్నాడు.
ఈ యాత్రకు సంబంధించి జోగేష్ ముందే అధికారుల అనుమతి తీసుకున్నాడు. ఎస్డీఎం అనుమతితో పోలీసులు అతనికి రక్షణగా నిలిచారు. జోగేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఈ యాత్రలో అతని వెంట నడిచారు. ఆలయానికి చేరుకున్నాక కొబ్బరికాయ కొట్టి, మొక్కు తీర్చుకుని తన ఉపవాసాన్ని విరమించాడు. ప్రస్తుతం ఈ వింత మొక్కుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
