Hyderabad : మేడ్చల్ జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం అయింది. రాంపల్లిలో విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయితో పాటుగా గద కూడా ధ్వంసం అయింది. నిందితులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. ఈ మేరకు ఆయన వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు.
హనుమాన్ విగ్రహం ధ్వంసం
మేడ్చల్ జిల్లా:::: కీసర PS పరిధిలో రాంపల్లి వద్ద హనుమాన్ విగ్రహం ధ్వంసం చేశారు.
రాత్రి హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. హనుమాన్ విగ్రహం ఎడుమ చేయితో పాటు గదను ధ్వంసం చేశారు. pic.twitter.com/edaIi2fOGQ
— Mana ToliVelugu Tv (@Mana_tolivelugu) October 17, 2025
ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం విగ్రహం ధ్వంసం కాదు హిందూ విశ్వాసాలపై నేరుగా దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ముత్యాలమ్మ ఆలయం, గణేష్ విగ్రహం, నవగ్రహ ఆలయం, భూలక్ష్మి ఆలయం, మాతాజీ ఆలయాలపై జరిగిన దాడులు హిందూ సమాజాన్ని కదిలించాయిని అన్నారు.
రాంపల్లి రామాలయం వద్ద శ్రీ హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఘటన స్థలాన్ని సందర్శించి, స్థానికులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించాను.
ఇది కేవలం విగ్రహం ధ్వంసం కాదు హిందూ విశ్వాసాలపై నేరుగా దాడి.
గతంలో ముత్యాలమ్మ ఆలయం, గణేష్ విగ్రహం, నవగ్రహ ఆలయం,… pic.twitter.com/Q3J3OR478e
— N Ramchander Rao (@N_RamchanderRao) October 17, 2025
మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే దుండగులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. బీజేపీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, హిందూ దేవాలయాల రక్షణ కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు.