రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. RTC బస్సును లారీ ఢీ.. స్పాట్లో 70 మంది!

rtc bus

RTC : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఢీకొన్న తర్వాత బస్సుపై బోల్తా పడింది టిప్పర్ లారీ. ఈ ప్రమాదంలో 12మృతి చెందగా 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్పాట్‌లో లారీ డ్రైవర్ మృతి చెందగా.. అతని డెడ్ బాడీ ఇరుక్కుపోయింది. గాయపడిన వారిని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై ఈ ఘటన జరగగా… చేవెళ్ల-వికారాబాద్‌ రూట్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో తాండూర్ డిపో బస్సు ప్రమాదానికి గురైంది. లారీలో ఉన్న కంకర పడటంతో బస్సులో ప్రయాణికులు కూరుకుపోయారు. బస్సులో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది బయటకు తీస్తున్నారు.