Karimnagar : కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శృంగారాన్ని ఎరగా వేసి, అమాయకులను ట్రాప్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న ఒక కిలాడీ జంటను పోలీసులు పట్టుకున్నారు. ఈ కిలాడీ జంట కరీంనగర్ పిల్ల 143 అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ను నడుపుతూ, సోషల్ మీడియా వేదికగా వల విసురుతున్నారు.
భార్యాభర్తలే కలిసి ఈ నీచమైన పనికి ఒడిగట్టడం గమనార్హం. భార్య శృంగారంగా మాట్లాడుతూ విటులను ఆకర్షిస్తుంటే, భర్త తెర వెనుక ఉండి షూటింగ్, బెదిరింపుల పర్వాన్ని నడిపిస్తున్నాడు. ఇలా దాదాపు వంద మందికి పైగా వ్యక్తులను వీరు హనీట్రాప్ చేసినట్లు సమాచారం.
ముందుగా సోషల్ మీడియా ద్వారా పెద్దమనుషులను, వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తారు. భార్య తన మాటలతో వారిని బుట్టలో వేసుకుని ఏకాంతానికి పిలుస్తుంది. ఆమె వారితో గడుపుతున్న సమయంలో, భర్త రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీస్తాడు. వీడియోలను చూపించి, బయట పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తారు.
గత మూడు సంవత్సరాలుగా, ఈ జంట 100 మందికి పైగా వ్యక్తుల నుండి పెద్ద మొత్తంలో డబ్బును బలవంతంగా వసూలు చేశారని దర్యాప్తులో తేలింది. దోపిడీ మొత్తాలు లక్షలాది రూపాయలు ఉన్నాయి. ఒక కేసులో, ఈ జంట ఒక వ్యాపారవేత్త నుండి ఏకంగా 1.3 మిలియన్లు వసూలు చేసి, ఆ తరువాత మరో రూ.500,000 అదనంగా డిమాండ్ చేశారు.
వ్యాపారవేత్త ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రాకెట్లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న కోట్లాది రూపాయలు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద ఉన్న డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే భయం లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తెలియని వ్యక్తుల వీడియో కాల్స్, అసభ్యకర సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.
