Kavitha : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలుపడ్డాయి.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై విక్టరీ కొట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బహిష్కరణ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ అమె ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్కు ఆమె ఎవరి పేరును ట్యాగ్ చేయలేదు. ఉప ఎన్నిక ఫలితాన్ని నేరుగా ప్రస్తావించలేదు. అయితే, సమయం, సందర్భాన్ని బట్టి చూస్తే, ఇది జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిని ఉద్దేశించే ట్వీట్ చేశారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.
Karma hits back !!! 🙏🙏🙏🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025
కాగా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి అనుకూలమైన రెఫరెండంగా భావిస్తోంది.
