BIG BREAKING : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ఎక్స్’ (X) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్ సహా అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాల్లో వేలాది మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం సుమారు 6:40 గంటల నుండి ఈ అంతరాయం మొదలైనట్లు డౌన్ డిటెక్టర్ గణాంకాలు చెబుతున్నాయి.
యూజర్లు తమ యాప్ లేదా వెబ్సైట్ను ఓపెన్ చేసినప్పుడు టైమ్లైన్ లోడ్ కాకపోవడం, కొత్త పోస్ట్లు కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మందికి “Something went wrong” అనే మెసేజ్ కనిపిస్తోంది. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 42,000 పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
ప్రస్తుతానికి ఎక్స్ యాజమాన్యం లేదా ఎలాన్ మస్క్ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, సర్వర్ మెయింటెనెన్స్ లేదా ఏదైనా సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఎక్స్ పనిచేయకపోవడంతో యూజర్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, త్రెడ్స్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ మళ్ళీ డౌన్ అయ్యింది అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. గత నవంబర్ 2025లో కూడా ఇలాగే భారీ స్థాయిలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
