BIG BREAKING : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు తెలంగాణ కేబినేట్ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. 2025 అక్టోబర్ 31 శుక్రవారం మద్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందాయి. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
రేపు 12.15 కి రాజ్ భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం మంత్రులకు అందిన ఆహ్వాన లేఖలు pic.twitter.com/q7Z0wEYeTB
— kotlata (@kotlataweb) October 30, 2025
అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటుగా ఇంకెవరు ప్రమాణం చేయనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర కేబినెట్లో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అజారుద్దీన్ కు హోం శాఖతో పాటుగా మైనార్టీ సంక్షేమం, క్రీడల శాఖలు అప్పగిస్తారని సమాచారం.
మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఈ మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. మైనారిటీ ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే ఈ హడావుడి మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపించారు. కాగా రేవంత్ కేబినేట్ లో ప్రస్తుతం మూడు ఖాళీలున్నాయి. అజారుద్దీన్ తో పాటుగా మరో ఇద్దరికి చోటు ఉంది. ఇందులో ఓసీ, బీసీలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. గవర్నర్ ఆమోదించాల్సి ఉంది.
