BIG BREAKING : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై బోరబండ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్రెడ్డి ఆమెపై ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు బుక్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తున్నారంటూ మోహన్రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్
ఓటమి భయంతో మాగంటి సునీత మీద కాంగ్రెస్ పార్టీ వరుస కుట్రలు
కారు గుర్తు ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదు
ఫిర్యాదు అందిన వెంటనే బోరబండ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీతపై కేసు నమోదు చేసిన ఎన్నికల సంఘం అధికారులు
తాము… pic.twitter.com/zguHYHpYMv
— Mirror TV (@MirrorTvTelugu) October 31, 2025
ఈ మేరకు మాగంటి సునీతపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు మాగంటి సునీత ప్రచారంలో దూసుకుపోతన్నారు.కాగా మాగంటి సునీత భర్త గోపీనాథ్ మరణతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. 2025 నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
