Hyderabad : హైదరాబాద్లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పట్ల అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల ఆగ్రహానికి దారితీసింది. అయ్యప్ప మాల ధరించిన ఒక విద్యార్థి పట్ల కళాశాల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. అయ్యప్ప మాలధారణలో ఎగ్జామ్స్ సెంటరు వెళ్లిన వ్యక్తిని స్వామి దుస్తులు తొలగించి సివిల్ డ్రెస్సులో కాలేజీ యాజమాన్యం అనుమతించింది.
ఈ రోజు మేడ్చల్ జిల్లా నారపల్లి లోని నల్ల మల్లారెడ్డి కళాశాలలో చదువుకుంటున్న స్టూడెంట్ ని అయ్యప్ప మాల వేసుకున్నందుకు, స్టూడెంట్ నీ బెదిరించి అయ్యప్ప వస్త్రధారణ తీయించి కాలేజ్ యూనిఫామ్ వేయించిన కాలేజీ యాజమాన్యం.
అయ్యప్ప మాల ధరించిన స్వామి తో దుర్భాషలాడిన లెక్చరర్. pic.twitter.com/Hi4SGT7ShX
— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) December 5, 2025
ఆ సంఘటన ఘట్కేసర్ మండలం నారపల్లి దివ్యానగర్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది.యాదగిరిగుట్టకు చెందిన చందు నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే శుక్రవారం అయ్యప్ప మాల ధరించి కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చాడు. కాలేజీ స్టాఫ్ మాల దుస్తులు ధరించి రాకుడదని ఆదేశించారు.
చందు ఎంత చెప్పిన వినకుండా బలవంతంగా అయ్య ప్ప మాల దుస్తులు తీయించి యూనిఫాం వేయించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఇవాళ కాలేజీ ఎదుట ఆందోళన చే స్తామని మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బండారి పవన్ రెడ్డి హెచ్చరించారు. ఇది అయ్యప్ప భక్తులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
