Loan Rule Changes : మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా? లేదా కొత్తగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ రూల్స్ మారుతున్నాయి. సాధారణంగా మనం లోన్ కట్టిన తర్వాత మన క్రెడిట్ స్కోర్ పెరగడానికి నెల రోజులు పట్టేది. కానీ ఇకపై అలా కాదు. ఇకపై ప్రతి 7 రోజులకు ఒకసారి మీ స్కోర్ మారిపోతుంది.
అంటే నెలలో నాలుగు సార్లు (7, 14, 21, 28 తేదీల్లో) మీ స్కోర్ అప్డేట్ అవుతుంది. మీరు లోన్ క్లియర్ చేస్తే, వెంటనే మీ స్కోర్ పెరిగిపోతుంది. దీనివల్ల కొత్త లోన్ తీసుకోవడం ఈజీ అవుతుంది. మీరు కట్టడం ఆలస్యం చేసినా అంతే వేగంగా స్కోర్ పడిపోతుంది కూడా.
చాలామంది దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లోన్ను ముందే కట్టేసి క్లోజ్ చేద్దామని అనుకుంటారు. కానీ బ్యాంకులు దానికి పెనాల్టీ లేదా ఫోర్క్లోజర్ చార్జీలు వేస్తాయి.హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటిని మీరు గడువు కంటే ముందే కట్టేస్తే.. ఇకపై బ్యాంకులు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా చార్జీ తీసుకోకూడదు. అంటే మీ సొంత డబ్బుతో ఎప్పుడైనా లోన్ క్లియర్ చేసుకోవచ్చు.
ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్కు ఒకరిద్దరిని మాత్రమే నామినీగా పెట్టే అవకాశం ఉండేది. ఏప్రిల్ 1 నుంచి మీ అకౌంట్ లేదా లాకర్కు నలుగురు నామినీలను చేర్చుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు ఆ డబ్బు అందడం చాలా సులభం అవుతుంది. బంగారం నగలు చేసే వారికి ఇచ్చే లోన్ కట్టడానికి టైమ్ పెంచారు. 180 రోజులు ఉన్న గడువును 270 రోజులకు పెంచారు. దీనివల్ల చిన్న వ్యాపారులకు మేలు జరుగుతుంది.
