NPS Vatsalya Scheme: దేశంలోని మోదీ సర్కార్ ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులోనే ఓ సూపర్ స్కీమ్ ఎన్పీఎస్ వాత్సల్య (NPS Vatsalya Scheme). 2024-25లో కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్ ను లాంచ్ చేశారు. చిన్న పిల్లల మీద పెట్టుబడి పెట్టి తల్లిదండ్రులు, సంరక్షకులు పెట్టుబడి పెట్టేలా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడే వారి పేరు మీద రిటైర్మెంట్ ఫండ్ను రెడీ చేసుకోవచ్చు అన్నమాట.
సాధారణంగా మనం జాబ్ లో చేరిన తర్వాత పెన్షన్ కోసం డబ్బులు దాచుకుంటాం. కానీ, ఈ పథకం ద్వారా పిల్లలు మైనర్లుగా (18 ఏళ్ల లోపు) ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారి పేరు మీద పెన్షన్ ఖాతా తెరవడానికి వీలు కలుగుతుంది. 18 ఏళ్ల లోపు వయసున్న ఏ మైనర్ అయినా ఈ పథకానికి అర్హులు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను నిర్వహిస్తారు. 18 ఏళ్లు నిండిన తర్వాత, ఈ ఖాతా ఆటోమేటిక్గా సాధారణ NPS Tier-I ఖాతాగా మారుతుంది. ఆ తర్వాత ఆ పిల్లలే స్వయంగా దీనిని కొనసాగించవచ్చు.
చిన్న వయస్సు నుంచే పెట్టుబడి పెట్టడం వల్ల, 60 ఏళ్లు వచ్చేసరికి భారీ నిధి జమ అవుతుంది. ఉదాహరణకు, నెలకు రూ.1,000 చొప్పున పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ నాటికి అది కోట్లలో ఉండే అవకాశం ఉంది.
నెలకు రూ.1,000 పెట్టుబడిపెడితే సంవత్సరానికి రూ.12,000 అవుతుంది. మీరు బిడ్డ పుట్టిన వెంటనే (0 ఏళ్లు) ఈ ఖాతా తెరిచి నెలకు రూ. 1,000 జమ చేస్తే18 ఏళ్ల కాలానికి మొత్తం మీరు జమ చేసిన సొమ్ము రూ.2,16,000 అవుతుంది. 10% రాబడితో వచ్చే మొత్తం: సుమారు రూ. 6,00,000గా ఉంటుంది. 12% రాబడితో వచ్చే మొత్తం సుమారు రూ.7,60,000గా ఉంటుంది. ఈ మొత్తాన్ని 18 ఏళ్ల తర్వాత విత్ డ్రా చేయకుండా అలాగే 60 ఏళ్ల వరకు అంటే రిటైర్మెంట్ వరకు కొనసాగిస్తే, ఆ చక్రవడ్డీ ప్రభావంతో అది కోట్లలోకి మారుతుంది.
ఒకవేళ అదే పెట్టుబడిపై రాబడి 12.85 శాతం వస్తే, ఆ నిధి విలువ అక్షరాలా రూ.11.05 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే మీరు కేవలం 18 ఏళ్ల పాటు కట్టిన రూ. 2.16 లక్షల సొమ్ము, 60 ఏళ్ల నాటికి ₹11 కోట్లుగా మారుతుందన్నమాట. ఇది కేవలం నెలకు రూ.1,000 పెట్టుబడితో సాధ్యమయ్యే లెక్క. అదే
NPS వాత్సల్యలో అసలైన లాభం18 ఏళ్ల తర్వాతే మొదలవుతుంది. 18 ఏళ్లు నిండాక ఈ ఖాతా సాధారణ NPS ఖాతాగా మారుతుంది. అప్పుడు మీరు కట్టడం ఆపేసినా, అప్పటివరకు జమ అయిన సొమ్ముపై వచ్చే వడ్డీ 60 ఏళ్ల వరకు పెరుగుతూనే ఉంటుంది.
18 ఏళ్ల తర్వాత బిడ్డకు కావాలంటే జమ అయిన మొత్తంలో 20% నగదుగా తీసుకోవచ్చు. మిగిలిన 80% మొత్తాన్ని యాన్యుటీ కింద పెన్షన్ కోసం మళ్లించాలి.
ఇది మ్యూచువల్ ఫండ్స్ తరహాలో మార్కెట్ ఆధారిత పథకం. కాబట్టి రాబడి స్థిరంగా ఉండదు, కానీ దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉంది.
మీరు బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా ఆన్లైన్లో e-NPS పోర్టల్ ద్వారా ఈ ఖాతాను సులభంగా ప్రారంభించవచ్చు. Birth Certificate, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్.. తల్లిదండ్రుల KYC పత్రాలు (ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్) దీనికి అవసరం.
ఖాతా తెరిచిన 3 ఏళ్ల తర్వాత, పిల్లల విద్య, తీవ్రమైన అనారోగ్యం లేదా వైకల్యం వంటి అత్యవసర అవసరాల కోసం జమ చేసిన మొత్తంలో 25% వరకు వెనక్కి తీసుకోవచ్చు. (మొత్తం మూడు సార్లు మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది).
Also Read :
-
PM SVANidhi credit card : వడ్డీ లేదు.. షూరిటీ లేదు: రూ.50 వేల స్వనిధి క్రెడిట్ కార్డ్ పొందండిలా.. ఎలా అప్లయ్ చేయాలంటే?
-
Donald Trump Gold Prices : ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్.. గోల్డ్ రేట్స్ పిచ్చి పిక్స్!
-
Upcoming Smartphones 2026 : ఫోన్ కొనే ప్లాన్లో ఉన్నారా? ఒక్క వారం ఆగండి.. మార్కెట్లోకి 3 అదిరిపోయే ఫోన్లు!
